![]() |
![]() |
by సూర్య | Wed, Apr 23, 2025, 07:55 AM
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ లైన్ అప్ ని కలిగి ఉన్నారు. నటుడు రాబోయే పీరియడ్ యాక్షన్ డ్రామా 'హరి హర వీర మల్లు' లో కనిపించనున్నారు. టాలెంటెడ్ సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమాని చేస్తునట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'OG' అనే టైటిల్ ని లాక్ చేసారు. మొదట్లో షూటింగ్ శరవేగంగా సాగింది, అభిమానులు ఆసక్తిగా బ్యాక్-టు-బ్యాక్ అప్డేట్లను అందిస్తూ వారి అంచనాలను మూవీ మేకర్స్ మరింత పెంచారు. అయితే, AP ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావడంతో సినిమా షెడ్యూల్కు బ్రేక్ పడింది. కేవలం ఒక నెల షూటింగ్ అసంపూర్తిగా మిగిలిపోయింది. తాజాగా ఇప్పుడు మేకర్స్ ఈ సినిమాని సెప్టెంబర్ 5న విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. రానున్న రోజులలో ఈ విషయం పై మేకర్స్ ఒక క్లారిటీ ని ఇవ్వనున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్, షామ్ మరియు హరీష్ ఉత్తమన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ పీరియాడికల్ గ్యాంగ్స్టర్ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ పతాకంపై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Latest News