![]() |
![]() |
by సూర్య | Thu, Apr 17, 2025, 06:38 PM
పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన లూసిఫెర్ త్రయం ఎల్ 2: ఎంప్యూరాన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ ని సృష్టిస్తుంది. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ హై-ఆక్టేన్ యాక్షన్ డ్రామా లో పృథ్వీరాజ్ సుకుమారన్, అభిమన్యు సింగ్, టోవినో థామస్, మంజు వారియర్ ముఖ్య పాత్రలో నటించారు. ఈ చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని జిఓ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం ఏప్రిల్ 24న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు డిజిటల్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఆశీర్వాద్ సినిమాస్ మరియు లైకా ప్రొడక్షన్స్ పతాకాలపై ఆంటోని పెరుంబవూర్ మరియు అల్లిరాజా సుభాస్కరన్ సంయుక్తంగా ఎల్ 2 ఎంపురాన్ చిత్రాన్ని నిర్మించారు.
Latest News