by సూర్య | Mon, Jun 24, 2019, 09:17 AM
టాలీవుడ టాప్ సింగర్ గీతామాధురి ఇంట ఓ శుభవార్త రానుంది. ఆమె త్వరలోనే తల్లికాబోతోంది. గీతామాధురి ప్రెగ్నెంట్ కావడంతో ఆమెకు కుటుంబసభ్యులు, బంధువులు ఘనగా సీమంతం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆచార సందప్రదాయాలతో వేడుకలా నిర్వహించారు. భర్త నందుతో పాటు, బంధువులు, గీతామాధురి స్నేహితులు పాల్గొన్నారు. సీమంతం వీడియోను తాజాగా విడుదల చేశారు. దీంతో యూట్యూబ్లో గీతామాధురి అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఆమె సీమంతం వేడుకను చూస్తున్నారు.
గీతామాధురి ఈ వీడియోలో సిగ్గుపడుతూ... ఎంతో ఆనందంగా కనిపించింది. సీమంతానికి సింగర్స్ అంజనా సౌమ్య, మాళవిక కూడా హాజరయ్యారు. యాంకర్ శ్యామల కూడా ఈ కార్యక్రమంలో కనిపించింది. గీతామాధురి, సినీ నటుడు నందూతో 2014లో వివాహం జరిగింది. మాస్ పాటలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొని ఫైనలిస్ట్గా కూడా నిలిచింది. పాటలతోనే కాకుండా అందంతో కూడా తన అభిమానుల్ని ఆకట్టుకుంటుంది గీతామాధురి. ఇప్పటికే వందల పాటలు పాడిన ఇప్పుడు గర్భవతి కావడంతో కొన్ని రోజులుగా పాటలకు దూరంగా ఉంది. పెళ్లైన ఇన్నాళ్లకు ఆమె తల్లి కావడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
Latest News