సినిమాకి కథ మారింది గానీ.. .

by సూర్య | Sun, Jun 23, 2019, 08:45 PM

నందమూరి బాలకృష్ణ, తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్ ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇటీవలే లాంఛనంగా లాంచ్ అయింది. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమాకి కథ మారింది గానీ.. బాలయ్య పాత్ర మాత్రం మారలేదని తెలుస్తోంది.
కెఎస్.రవికుమార్ మొదట బాలయ్యకు పోలీస్ కథ చెప్పాడట. బాలయ్యది పోలీసు పాత్ర. విలన్ రోల్ మాత్రం ఏపీ సీఎం జగన్ పోలికలతో ఉండేలా చెప్పాడట. అప్పటికి ఏపీ ఎన్నికల ఫలితాలు రాలేదు. తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందనే ఉద్దేశంతో బాలయ్య ఓకే చెప్పాడు. అయితే మే23 తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయింది. దాంతో కథ కూడా మార్చాల్సి వచ్చింది.
కథ మారింది గానీ బాలయ్య పాత్ర మాత్రం మార్చలేదట డైరెక్టర్. ఈ కొత్త కథలో కూడా బాలకృష్ణ పోలీసు అధికారిగానే కనిపించనున్నాడు. బాలయ్యకి పోలీసు ఆఫీసర్ రోల్స్ బాగా కలిసొచ్చాయి. ఆయన కెరీర్‌లో ‘రౌడీ ఇన్స్‌పెక్టర్’ వంటి ఎన్నో హిట్ సినిమాలున్నాయి. అందుకే పోలీసు రోల్‌ని మార్చలేదని తెలుస్తోంది.
ఈ చిత్రంలో హీరోయిన్‌గా శ్రియను ఎంపిక చేశారని టాక్. కాగా ఈ సినిమా షూటింగ్‌ను స్పీడ్ గా పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని చూస్తున్నారట నిర్మాతలు.

Latest News
 
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM