by సూర్య | Sat, Jun 22, 2019, 10:51 PM
ప్రపంచ కప్ నేపథ్యంలో సినిమా వాయిదా వేసారు.రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఇస్మార్ట్ శంకర్' రూపొందుతోండుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పనులు ముగింపు దశకి చేరుకున్నాయి. రామ్ సరసన నిధి అగర్వాల్ - నభా నటేశ్ హీరోయిన్ లుగా నటిసస్తున్నారు.మొదట ఈ సినిమాను జూలై 12వ తేదీన విడుదల చేయాలనుకున్నారు కానీ, ఇప్పుడు అందరి దృష్టిక్రికెట్ ప్రపంచ కప్ మీద పడడంతో ఆ ప్రభావం 'ఇస్మార్ట్ శంకర్' వసూళ్లపై పడొచ్చనే ఉద్దేశంతో విడుదల తేదీని జూలై 18వ తేదీకి మార్చారు. ఈ విషయాన్ని ఈ సినిమా టీమ్ అధికారికంగా తెలియజేసింది. ఈ సినిమాలో రామ్ ను పూర్తి మాస్ లుక్ తో పూరి చూపిస్తున్నాడు. మాస్ ఆడియన్స్ ను అలరించడానికి అందుకు సంబంధించిన అన్ని అంశాలు ఉండేలా చూసుకున్నాడు. ఆయన ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయో చూడాలి మరి.
Latest News