ఐడియా టెలికాం కంపనీపై మండిపడ్డ కుర్ర హీరో!

by సూర్య | Thu, Jun 20, 2019, 09:08 PM

ఐడియా టెలికాం కంపనీపై టాలీవుడ్ కుర్ర హీరో అడివి శేష్ మండిపడ్డాడు. తాను విదేశాలకు వెళ్లే సమయంలో ఐడియా కంపనీ ఇంటర్నేషనల్ ప్యాక్ తో రీచార్జ్ చేయించుకున్నానని, కానీ విదేశాల్లో ఆ ప్యాక్ పనిచేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విషయమై ఫిర్యాదు చేసినా ఐడియా కంపనీ తన డబ్బుని రీఫండ్ చేయలేదని, ఆ సంస్కారం కూడా లేదని విమర్శించారు. డబ్బులు ముఖ్యం కాదని, ఐడియా కంపనీ  అనైతికంగా వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. ఇక హైదరాబాద్ లో కాల్ క్వాలిటీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని ఎద్దేవా చేశారు.
ఈ విషయంలో ఐడియా ప్రతినిధుల స్పందన అధ్బుతంగా ఉందనీ.. వాళ్లకి కనీస పరిజ్ఞానం కూడా లేదని విమర్శించారు. దీనికి తోడు ప్రతీరోజు తనకు స్పామ్ కాల్స్ ఎక్కువయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కారణాల వలన తాను ఐడియా నెట్ వర్క్ నుండి మారిపోతున్నట్లు చెప్పారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ హీరో 'ఎవరు' అనే సినిమాలో నటిస్తున్నాడు. 


 

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM