by సూర్య | Thu, Jun 20, 2019, 08:38 PM
టైటిల్ ఒకటే ఉంటుంది. కానీ కథలు మారిపోతాయి. దానికి తగ్గట్టే హీరో హీరోయిన్లు, నటీనటులు కూడా మారిపోతుంటారు. నవ్విస్తూ, భయ పెడుతూ, మెసేజ్ ఇస్తూ తెరకెక్కిన రాజుగారి గది, రాజుగారి గది 2 సినిమాలు ఆడియన్స్ను ఆకట్టుకున్నాయి. ఓంకార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలకు సీక్వెల్గా మూడవ పార్ట్ రూపొందనుంది. ఫస్ట్ పార్ట్లో ఓంకార్ సోదరుడు అశ్విన్ బాబు, ధన్య బాలకృష్ణన్ జంటగా నటించగా, సెకండ్ పార్ట్లో కింగ్ నాగార్జున, సమంత, సీరత్ కపూర్ లీడ్ రోల్స్ చేసారు. థర్డ్ పార్ట్లో మిల్కీబ్యూటీ తమన్నా, అశ్విన్ నటించనున్నారు.
రాజుగారి గది 3ని ఓక్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ఓంకార్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నాడు. జూన్ 20న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. అశ్విన్, తమన్నాలపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్కి ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్ నివ్వగా, స్టార్ మా బిజినెస్ హెడ్ అలోక్ జైన్ కెమెరా స్విచ్చాన్ చేసాడు. ఓంకార్ ఫస్ట్ షాట్ డైరెక్ట్ చేసాడు. జూన్ 21నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.
మూడు నెలల్లో షూటింగ్ పూర్తి చెయ్యాలని భావిస్తున్నారు. ఇంతకుముందు వచ్చిన రెండు పార్ట్స్కి ఏమాత్రం తగ్గకుండా ఈ సీక్వెల్ ఉంటుందని ఓంకార్ చెప్పాడు. మాటలు : సాయిమాధవ్ బుర్రా, కెమెరా : చోటా కె. నాయుడు, ఎడిటింగ్ : గౌతంరాజు.