ఒక యాడ్ కోసం కలిసి నటించనున్న కోహ్లీ, ఎన్టీఆర్ !

by సూర్య | Thu, Jun 20, 2019, 01:07 PM

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి పనిచేయడం ఏంటని అనుకుంటున్నారా? ఎన్డీటీవీ తయారు చేయనున్న ఓ అవగాహనా కార్యక్రమంలో వీరిద్దరూ కలిసి నటించనున్నారు. మందు కొట్టి వాహనాలు నడపడం వల్ల ఎన్నో ప్రాణాలు పోతున్నాయన్న సంగతి తెలిసిందే. ఈ తరహా ఘటనల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున ప‌డుతున్నాయి. దీనిపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న‌ను కల్పించేందుకు ఎన్డీటీవీ ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భారత జట్టు క్రికెట్ టీమ్ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ, ఎన్టీఆర్ లు క‌లిసి వ‌ర్క్ చేయ‌బోతున్నారు. వీరిద్దరే కాదు. పలు రంగాల్లోని మరో ఏడుగురు సెల‌బ్రిటీలు కూడా ప్ర‌చారక‌ర్త‌లుగా ప‌నిచేయ‌నున్నారని తెలుస్తోంది. నేడో, రేపు ఈ కార్యక్రమానికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువడుతుందని సమాచారం.

Latest News
 
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM