by సూర్య | Thu, Jun 20, 2019, 12:21 PM
సమంత ప్రధానపాత్రలో నందిని రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘ఓ బేబి’. కొరియాలో మంచి విజయం సాధించిన ఓ మై గ్రానీ రీమేక్గా ఈ చిత్రం తెరకెక్కింది. జూలై 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఆద్యంతం కామెడీగా తెరకెక్కిన ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా సమంత నటన అందరినీ మెప్పిస్తోంది. అలాగే మిక్కీ జే మేయర్ అందించిన బ్యాక్గ్రౌండ్ ట్రైలర్కు అస్సెట్గా నిలిచింది. మొత్తానికి ట్రైలర్తో సినిమాపై అంచనాలను మరింత పెంచింది సమంత.
Latest News