అభిమానుల నుంచి దిశాను కాపాడిన టైగర్

by సూర్య | Mon, Jun 17, 2019, 03:33 PM

 బాలీవుడ్ యువ సెలబ్రిటీలు దిశా పటానీ, టైగర్ ష్రాప్ కొంతకాలంగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ జంట ఇటీవలే ముంబైలోని బస్టియన్ రెస్టారెంట్‌కు వెళ్లింది. అయితే దిశా పటానీ రెస్టారెంట్ బయటకు రాగా..ఆ ఫొటోలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారడంతో ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో రెస్టారెంట్ వద్దకు వచ్చారు. అభిమానులంతా ఒక్కసారిగా దిశాపటానీ దగ్గరకు వచ్చేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న టైగర్ తన బాడీగార్డ్స్‌తో అక్కడికి వచ్చి..రద్దీగా ఉన్న అభిమానుల నుంచి దిశాపటానీని కాపాడి సురక్షితంగా కారులో ఎక్కించాడు. టైగర్, దిశా తరచుగా ముంబైలోని బస్టియన్ రెస్టారెంట్‌కు వెళ్తుంటారు. ఇటీవలే దిశా పటానీ తన పుట్టినరోజు వేడుకలను టైగర్‌తో కలిసి ఇదే రెస్టారెంట్ వద్ద అభిమానుల సమక్షంలో జరుపుకుంది.

Latest News
 
త్వరలో 'విదా ముయార్చి' ఫస్ట్ లుక్ విడుదల అనౌన్స్మెంట్ Thu, Apr 25, 2024, 04:16 PM
రేపే 'కృష్ణమ్మ' ట్రైలర్ విడుదల Thu, Apr 25, 2024, 04:14 PM
2M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'పోటెల్' టీజర్ Thu, Apr 25, 2024, 04:09 PM
'బేబీ జాన్' నుండి స్పెషల్ పోస్టర్ రిలీజ్ Thu, Apr 25, 2024, 04:04 PM
రేపు థియేటర్స్ లో సందడి చేయటానికి సిద్ధంగా ఉన్న 'రత్నం' Thu, Apr 25, 2024, 04:02 PM