by సూర్య | Sat, Jun 15, 2019, 02:32 PM
మలయాళ నటి కీర్తి సురేష్ ఆనతి కాలంలోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. మహానటి చిత్రంలో సావిత్రి పాత్ర పోషించిన కీర్తి తన అభినయంతో ఎంతగానో ఆకట్టుకుంది. ఆమె నటనకి విమర్శకుల ప్రశంసలు లభించాయి. ప్రస్తుతం మన్మథుడు 2 చిత్రంతో పాటు, నాగేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న సఖి చిత్రంలో నటిస్తుంది . ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ స్పెయిన్లో జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే గత చిత్రాలలో బొద్దుగా కనిపించిన కీర్తి సురేష్ సఖిలో సన్నగా, నాజూకుగా కనిపించనుంది. పాత్ర కోసం తాను జిమ్లో కసరత్తులు చేసి చాలా కేజీల బరువు తగ్గింది. కీర్తి న్యూ లుక్కి సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, వాటిని చూసి అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఒకప్పుడు ఎంతో బొద్దుగా ఉండే కీర్తి, ఇంత సడెన్గా ముద్దుగా ఎలా మారిందంటూ పలు కామెంట్స్ పెడుతున్నారు. మరోవైపు కీర్తి బధాయి హో ఫేం అమిత్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో నటిస్తుంది. బోనీ కపూర్ నిర్మించనున్న ఈ చిత్రంతో కీర్తి బాలీవుడ్లోకి అడుగుపెడుతుంది. లేడీ ఓరియెంటెడ్ మూవీగా ఈ చిత్రం ఉండనున్నట్టు టాక్.
Latest News