'సాహో' సినిమా దగ్గరపడుతున్నకొద్దీ 'సుజిత్' కి టెన్షన్ పెరుగుతోందట !

by సూర్య | Sat, Jun 15, 2019, 11:55 AM

ప్రభాస్ కథానాయకుడిగా దర్శకుడు సుజిత్ 'సాహో' సినిమాను రూపొందిస్తున్నాడు. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా త్వరలో పాటల చిత్రీకరణను పూర్తిచేసుకోనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి సుజిత్ ప్రస్తావించాడు.


"నిజానికి ఇది నా అనుభవానికి మించిన బాధ్యత. నన్ను నమ్మి ఇంతటి బాధ్యతను నిర్మాతలు నాకు అప్పగించారు. ప్రభాస్ గొప్ప స్టార్ అయినప్పటికీ ఆయన కూడా నన్ను నమ్ముతూ ప్రాజెక్టును ముందుకు నడిపిస్తూ వస్తున్నాడు. ఆయన చాలా కూల్ హీరో .. ఏ రోజునా నన్ను టెన్షన్ పెట్టలేదు. కానీ విడుదల తేదీ దగ్గర పడుతున్నా కొద్దీ నాలో టెన్షన్ పెరుగుతోంది. ఇది అందరి దర్శకులకి వుండే టెన్షనే. ఆగస్టు 15న రానున్న ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వుంది" అని చెప్పుకొచ్చాడు. 

Latest News
 
సందీప్ కిషన్ కొత్త సినిమా ప్రారంభం Tue, Apr 23, 2024, 01:58 PM
ఫరియా అబ్దుల్లా కాలుపై ఉన్న టాటూ అర్ధం ఏంటో తెలుసా? Tue, Apr 23, 2024, 10:37 AM
36 గంటల పాటు అభిమాని శ్రమ...10 వేల పదాలతో దళపతి విజయ్‌పై కవిత Mon, Apr 22, 2024, 10:51 PM
ఈ సారి ‘కూలీ'గా రాబోతున్న రజనీకాంత్‌ Mon, Apr 22, 2024, 09:10 PM
20 భాషలలో డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్న 'కంగువ' Mon, Apr 22, 2024, 08:45 PM