by సూర్య | Tue, Jun 11, 2019, 12:37 PM
సినీనటి సురేఖవాణి ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉంటారు. తన కూతురు సుప్రితతో గడిపే క్షణాలను ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అలాగే ఆమె రకరకాల కాస్ట్యూమ్స్తో దిగిన ఫొటోలను కూడా ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటారు సురేఖవాణి. అయితే, ఇటీవల తన కూతురు సుప్రితతో తీసుకున్న ఒక ఫొటోను సురేఖవాణి ఇన్స్టాగ్రామ్లో పెట్టారు. ఈ ఫొటోలో వీరిద్దరూ మోడరన్ డ్రెస్సుల్లో ఉన్నారు. ఈ పోస్ట్పై ఇప్పుడు నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఎవరికి ఇష్టమొచ్చినట్లు వారు అసభ్యకర కామెంట్లు పెడుతున్నారు.
గతనెలలో సురేఖవాణి భర్త సురేష్ తేజ మృతిచెందిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో మే 6న సురేష్ తేజ కన్నుమూశారు. ఆ తరవాత చాలా రోజులకు అంటే రంజాన్ పండుగ రోజున శుభాకాంక్షలు తెలుపుతూ సురేఖవాణి ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టారు. తాజాగా మూడు రోజుల క్రితం మరో పోస్ట్ పెట్టారు. అదే ఈ తల్లీకూతుళ్ల ఫొటో. ఈ పోస్ట్ పెట్టగానే నెటిజన్లు తమ చేతివేళ్లకు పనిచెప్పారు. వెంటనే కామెంట్లు అందుకున్నారు.
Latest News