by సూర్య | Fri, Mar 22, 2019, 06:34 PM
తమిళ భామ నివేదా పేతురాజ్ వివాదంలో ఇరుక్కుంది . తాజాగా ఈ భామ మధురై లోని మీనాక్షి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళింది అదే వివాదానికి కారణం అయ్యింది . దర్శనం కోసం వెళితే వివాదం ఏంటి ? అని అనుకుంటున్నారా ? గుడి లోకి మొబైల్ ఫోన్ లను తీసుకెళ్లడం నిషేధం అయితే నివేదా పేతురాజ్ హీరోయిన్ అంటే సెలబ్రిటీ కాబట్టి సెక్యూరిటీ వాళ్ళు చూసి చూడనట్లుగా పంపించి ఉంటారు దాంతో హాయిగా లోపల ఫోటోలు దిగడమే కాకుండా వాటిని సోషల్ మీడియాలో పెట్టేసింది .
ఇంకేముంది వివాదం రాజుకుంది . గుడిలోకి సెల్ ఫోన్ తీసుకెళ్లొద్దు అన్న విషయాన్నీ మర్చిపోయి ఇలా చేస్తావా ? నువ్ సెలబ్రిటీ అయినంత మాత్రాన అమ్మవారి ముందు సామాన్య భక్తురాలివే అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పాపం . తమిళ చిత్రాల్లో నటించే ఈ భామ తాజాగా తెలుగులో రెండు చిత్రాల్లో నటిస్తోంది
#madurai pic.twitter.com/Ihr8FwF4lP
— Nivethapethuraj (@NPethurajTrend) March 20, 2019