కొద్దిసేపు యాంకర్ గా మారిన రామ్ గోపాల్ వర్మ

by సూర్య | Fri, Mar 22, 2019, 03:21 PM

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ ప్రమోషన్స్‌కి వచ్చిన ఏ ఒక్క అవకాశాలన్ని వదిలిపెట్టడం లేదు రామ్ గోపాల్ వర్మ. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌లతో సినిమాపై అంచనాలను పెంచేసిన వర్మ.. ఈ మూవీ విడుదలలో వచ్చిన వివాదాలను సైతం ప్రమోషన్స్‌కి వాడేస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా నేడు (మార్చి 22) విడుదల కావాల్సి ఉండగా.. సెన్సార్ సమస్యలు తలెత్తి క్లియరెన్స్ రాకపోవడంతో మార్చి 29కి వాయిదా పడిన విషయం తెలిసిందే.

ఇక తన సినిమా ప్రమోషన్స్‌ను వేగవంతం చేస్తూ టీవీ 5 ఛానల్‌కి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి వెళ్లిన ఆయన న్యూస్ ప్రజెంటర్‌గా మారారు. ఆ కార్యక్రమానికి యాంకర్ ఉన్న మూర్తికి బదులుగా బులిటెన్ హెడ్ లైన్స్ చదివి వారెవ్వా వర్మా అనిపించారు. మూర్తికంటే మీరే వార్తలు బాగా చదువుతున్నారని నెటిజన్లు స్పందిస్తున్నారంటే వర్మలోని మల్టీటాలెంట్‌ను అర్ధం చేసుకుకోవచ్చు. ఎక్కడా తడబాటు లేకుండా.. ఆన్ ఎయిర్ విజువల్స్‌కి తగ్గట్టుగా స్కిప్ట్‌ను హెడ్‌లైన్స్ ఫ్లోలో చక్కగా చవివారు. వర్మ వార్తలు చదువుతుంటే..ఆ కార్యక్రమానికి యాంకర్‌గా ఉన్న మూర్తి సైతం ఆశ్చర్యపోయారు.

చాలా బాగా చదివారు వర్మగారూ.. టెన్షన్ ఏమైనా పడ్డారా? అంటే కొంచెం అలానే ఉందన్నారు వర్మ. ఎక్కడ టెన్షన్ పడ్డారు.. చంద్రబాబుని పొగుడుతూ, జగన్‌కి ఓటు వేయొద్దు అన్నప్పుడేనా అంటూ మూర్తి వ్యంగ్యంగా అడగటంతో.. కాదు హెడ్ లైన్స్ కమాండ్ బులిటెన్ ప్రొడ్యుసర్‌ నుండి వచ్చినప్పుడు అంటూ తనదైన శైలిలో సమాధానం చెప్పారు వర్మ. తాజాగా తాను ఫస్ట్ టైం న్యూస్ హెడ్ లైన్స్ చదివా అంటూ వీడియోని షేర్ చేశారు వర్మ. 

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'రంగ రంగ వైభవంగా' Sat, Apr 20, 2024, 06:46 PM
త్వరలో డిజిటల్ ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధం అవుతున్న 'మంజుమ్మెల్ బాయ్స్' Sat, Apr 20, 2024, 06:43 PM
'రాజా సాబ్' గురించిన లేటెస్ట్ అప్డేట్ Sat, Apr 20, 2024, 06:32 PM
జీ తెలుగులో ఆదివారం స్పెషల్ మూవీస్ Sat, Apr 20, 2024, 06:29 PM
'SK23' షూటింగ్ పూర్తి అయ్యేది ఎప్పుడంటే...! Sat, Apr 20, 2024, 06:27 PM