by సూర్య | Fri, Mar 22, 2019, 01:32 PM
మలయాళ బ్యూటీ కీర్తి సురేష్ ప్రస్తుతం నరేంద్ర దర్శకత్వంలో తన 20 వ చిత్రంలో నటిస్తుంది. ఇక ఈ చిత్రం తరువాత కీర్తి హిందీ సినిమాలో నటించనుంది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఆమె స్టార్ హీరో అజయ్ దేవగన్ కు జోడిగా నటించనుంది. ‘బడాహీ హో’ ఫేమ్ అమిత్ షా డైరెక్ట్ చేయనున్నఈ చిత్రం జూన్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ చిత్రంలో కీర్తి డిఫ్రెంట్ లుక్స్ లో కనిపించనుందట. అందులో ఒకటి యంగ్ లుక్ కాగా మరొకటి ఏజ్డ్ లుక్.
ఫ్రెష్ లైమ్ ఫిలిమ్స్ తో కలిసి బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ నిర్మించనున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో విడుదలకానుంది. కాగా ఈ చిత్రం తో కీర్తి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.
Latest News