by సూర్య | Wed, Mar 20, 2019, 05:09 PM
కొన్ని రోజుల నుంచి తమిళ హీరో అజిత్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ తనకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనే లేదని కూడా బద్దలు కొట్టాడు అజిత్. ఇదిలా ఉంటె అజిత్ రాజకీయాల్లోకి వస్తే మంచి మార్పు జరుగుతుందని డైరెక్టర్ సుశీంద్రన్ ఒక లేఖను విడుదల చేశాడు. అయితే తమిళ హీరో శింబు సోదరుడు, టి. రాజేందర్ తనయుడు కురాలారాసన్ పేరుతో వున్న ఒక ట్విట్టర్ ఎకౌంట్ నుంచి సుశీంద్రన్ పోస్టుకు సమాధానం వచ్చింది. అజిత్ రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనను తప్పుబడుతూ, 'మా నాన్నే తమిళనాడుకి కాబోయే సీఎమ్' అంటూ కామెంట్ వచ్చింది. దాంతో అజిత్ ఫ్యాన్స్ తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. ఈ విషయంపై టి. రాజేందర్ స్పందిస్తూ .. "ఆ ట్విట్టర్ అకౌంట్ మా అబ్బాయిది కాదు .. ఫేక్. మా అబ్బాయి పేరుతో ఫేక్ ఎకౌంట్ ను క్రియేట్ చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము" అని హెచ్చరించారు.
Latest News