by సూర్య | Wed, Mar 20, 2019, 03:46 PM
మహానటి సినిమాతో మరపురాని విజయాన్ని అందుకుంది 'కీర్తి సురేష్'. సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం లో కీర్తి ని చూస్తే అచ్చం సావిత్రి గారినే చూస్తున్నట్లనిపించింది .మహానటి సినిమాలో కీర్తి అద్భుతమైన నటనతో ప్రేక్షకుల నుండి ఇండస్ర్టీ పెద్దల నుండి మంచి ప్రశంశలు అందుకుంది. ఆ సినిమా తర్వాత ఒక్కటి కూడా ఆమె అంగీకరించలేదు. తమిళం లో మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే తెలుగులో ఒక కథ నచ్చడంతో చేయడానికి వెంటనే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
నరేంద్రనాథ్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పై మహేశ్ కోనేరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నాయిక ప్రాధాన్యత కలిగిన ఈ సినిమా ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది. రాజేంద్రప్రసాద్ .. సీనియర్ నరేశ్ .. నదియా .. కమల్ కామరాజు .. భానుశ్రీ మెహ్రాలను ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల కోసం తీసుకున్నారు. అందుకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్ ను కూడా వదిలారు.