by సూర్య | Tue, Mar 19, 2019, 03:12 PM
వరుసగా ప్లాప్స్ లతో సతమవుతున్న సాయి ధరమ్ తేజ్ నుండి వస్తున్న చిత్రం 'చిత్రలహరి'. ఈ చిత్రం లోమెగా మేనల్లుడు సరి కొత్త లుక్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్స్ గా కళ్యాణి ప్రియదర్శని, నివేత పేతురాజ్ నటిస్తున్నారు. ఏప్రిల్ 12న విడుదల కాబోతున్న ఈ చిత్రం ఇంకా మూడు వారాలు ఉండగానే.. అప్పుడే అన్ని ఏరియాల్లో బిజినెస్ పూర్తి చేసేసుకుంది. థియేట్రికల్ రైట్స్ మరియు డబ్బింగ్ రైట్స్ ఇంకా ప్రైమ్ వీడియో రైట్స్ తో పాటు శాటిలైట్ రైట్స్ ను కూడా కలుపుకుంటే.. దాదాపుగా ఈ చిత్రం 25 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. వరుసగా ప్లాప్స్ లో ఉన్న హీరో సినిమాకు.. ఈ రేంజ్ బిజినెస్ జరగడం నిజంగా విశేషమే.'చిత్రలహరి' సినిమాను సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందిస్తున్నారు. సంచలన సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Latest News