by సూర్య | Mon, Mar 18, 2019, 01:08 PM
'అలా మొదలైంది' చిత్రం తో అలా అలా టాలీవుడ్ కి చేరువైంది 'నిత్య మీనన్'. నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఏ విషయాలైన సరే భయపడకుండా నిర్మొహమాటంగా చెప్పే వ్యక్తిత్వం తనది. ఒకసారి హీరోయిన్ అయ్యుండి ఇంత లావయ్యారేంటని అడిగితే.. నేనెలా ఉంటే మీకేంటి.. సినిమాల్లో నటించే వాళ్లయితే మాత్రం లావవ్వకూడదా అని ప్రశ్నించడం నిత్యకే చెల్లింది.
ఒక టాలీవుడ్ లోనే కాకుండా మలయాళం లోను ఇతర భాషల లోను తనకు నచ్చిన సినిమాలు చేస్తూ వెళ్తుంది. ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఇటీవల నిత్య మీనన్ ఒక అబ్బాయిని కౌగిలించుకుంటున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఫొటోతో పాటుగా #friends #love #happyness అంటూ హ్యాష్ ట్యాగ్స్ జోడించడంతో జనాలకు సందేహాలు కలిగాయి. ఆ అబ్బాయి నిత్య బాయ్ ఫ్రెండ్ అని , ఆమె అతడితో రిలేషన్షిప్లో ఉందని గుసగుసలు వినిపించాయి. ఐతే కొన్ని రోజుల పాటు ఈ రూమర్లపై మౌనం వహించిన నిత్య ఎట్టకేలకు స్పందించింది. సస్పెన్సుకు తెరదించింది. ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి తనకు మంచి మిత్రుడు మాత్రమే అని నిత్య తెలిపింది. ఇంకా చెప్పాలంటే అతను తనకు తమ్ముడి లాంటి వాడని నిత్య పేర్కొనడం విశేషం.
నిత్యమీనన్ ప్రస్తుతం దివంగత తమిళనాడు సీఎం 'జయలలిత' బయోపిక్ లో నటిస్తుంది. ఈ సినిమా కోసం ఆమె చాల కష్టపడి తన బరువుని పెంచుకుంటుంది.