నితిన్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ తోనే కనెక్ట్ అయ్యాడు

by సూర్య | Mon, Mar 18, 2019, 12:31 PM

హీరో నితిన్ గత కొంతకాలంగా వరుస ప్లాపులతో సతమతం అవుతున్నాడు. చివరగా వచ్చిన 'లై', 'చల్ మోహన్ రంగ', 'శ్రీనివాస కళ్యాణం ' బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.  ఇక  అతనికి హిట్ ఇచ్చిన డైరెక్టర్ తోనే మళ్ళీ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. 'గుండె జారి గల్లంతయ్యిందే' చిత్రం నితిన్ ను యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా చేసింది. దర్శకుడిగా ఈ సినిమా విజయ్ కుమార్ కొండాకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు అదే దర్శకుడితో కలిసి మరో సినిమా చేయడానికి నితిన్ రెడీ అవుతున్నాడనే వార్త బలంగా వినిపిస్తోంది.

వరుస  ప్లాపులతో ఉన్న నితిన్ కి  దర్శకుడు విజయ్ కుమార్ కొండా .. నితిన్ ని కలిసి ఒక కథ వినిపించగా, ఆయన ఓకే చెప్పేశాడని అంటున్నారు. కథాకథనాల్లోని కొత్తదనమే అందుకు కారణమని చెబుతున్నారు. ప్రస్తుతం దర్శకుడు వెంకీ కుడుములతో కలిసి 'భీష్మ' సినిమా కోసం నితిన్ సెట్స్ పైకి వెళ్లే పనిలో వున్నాడు. ఆ తరువాత ఆయన సినిమా విజయ్ కుమార్ కొండాతోనే.

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM