'టైగర్ నాగేశ్వరరావు' బయోపిక్ లో 'ఆర్ ఎక్స్ 100' హీరోయిన్
by సూర్య |
Mon, Mar 18, 2019, 12:16 PM
చిన్న సినిమాగా విడుదలైన 'ఆర్ ఎక్స్ 100' బంపర్ హిట్టును దక్కించుకుంది. ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన 'పాయల్ రాజపుత్' తన అందాలను ఆరబోతగా పోసి ఆ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా తర్వాత ఆమెకు చాల సినిమాల నుండి అవకాశాలు వెల్లువెత్తున్నాయి. తాజాగా పాయల్ ఇంకో సినిమా చేయడానికి అంగీకరించింది అని సమాచారం.
పెద్ద గజదొంగ అయిన 'టైగర్ నాగేశ్వరరావు' బయోపిక్ ను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు దర్శకుడు వంశీకృష్ణ . 1980 - 90లలో స్టూవర్టుపురం గజదొంగగా 'టైగర్ నాగేశ్వరరావు' ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. దొంగతనాలు చేయడంలో మంచి నేర్పరి అయిన ఆయన, పోలీసువారికి పెద్ద తలనొప్పిగా తయారయ్యాడు. అలాంటి ఆయన బయోపిక్ లో హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ నటించనున్నాడు. ఆయన జోడీగా పాయల్ రాజ్ పుత్ ను తీసుకున్నారు. బుర్రా సాయిమాధవ్ ఈ సినిమాకి సంభాషణలను సమకూర్చుతున్నాడు.
Latest News