by సూర్య | Sat, Mar 16, 2019, 06:56 PM
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అతని దయ హృదయాన్ని చూపించాడు. శ్రీకాకుళానికి చెందిన పర్వీన్ బేబి(12) క్యాన్సర్తో బాధపడుతోంది. ఈ చిన్నారికి మహేష్ అంటే చాలా ఇష్టమట. విషయం తెలుసుకున్న మహేష్.. శ్రీకాకుళం వెళ్లి పర్వీన్ని కలిసి చాలా సేపు సమయాన్ని అక్కడే గడిపాడు క్యాన్సర్తో బాధపడుతున్న చిన్నారిని కలిసి ధైర్యం చెప్పి సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల మనసు దోచుకున్నాడు. పర్వీన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. ఆ చిన్నారికి ధైర్యం చెప్పి భారంగా అక్కడి నుంచి కదిలాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Latest News