by సూర్య | Sat, Mar 16, 2019, 04:55 PM
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ మూవీని రామ్ చరణ్ తేజ్ కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. నయనతార చిరంజీవితో జోడీ కడుతున్నారు.
తాజాగా ఈ సినిమా సెట్లో అమితాబ్ తో కలిసి తాను దిగిన ఒక ఫొటోను సుదీప్ తన ట్విట్టర్లో షేర్ చేశాడు. 'రణ్' తరువాత పదేళ్లకు ఇలా లెజెండ్ అమితాబ్ తో కలిసి తెరను పంచుకునే అదృష్టం కలిగింది. అందుకు కారకులైన రామ్ చరణ్ కి .. సురేందర్ రెడ్డికి .. ఈ సినిమా టీమ్ కి నా ధన్యవాదాలు. థ్యాంక్యూ అమితాబ్ బచ్చన్ గారూ .. మీ ప్రేమాభిమానాలు నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి" అని ట్విట్టర్లో రాసుకొచ్చాడు. ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన విడుదల చేయనున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది.
Latest News