by సూర్య | Sat, Mar 16, 2019, 12:44 PM
గత ఏడాది 'భరత్ అనే నేను' సినిమాతో హిట్ కొట్టాడు ప్రిన్స్ మహేష్ బాబు.మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం లిస్ట్లో ప్రిన్స్ కూడా చేరిపోయారు అని విషయం మనకు తెలిసిందే.మహేష్ బాబు మైనపు బొమ్మ ఈనెల 25న ఏంఎమ్ బి సినిమాస్ లో ఆవిష్కృతం కానున్న విషయం కూడా తెలిసిందే. అయితే ఈ సందర్భంగా మహేష్ అభిమానులకోసం మేడమ్ టుస్సాడ్ సింగపూర్ ఒక కాంటెస్ట్ ను తీసుకొచ్చింది. ఈ కాంటెస్ట్ లో గెలిస్తే మహేష్ తో సెల్ఫీ తో దిగొచ్చు.
దానికి చేయవల్సిందల్ల ఒక్కటే మహేష్ బొమ్మను గీసి మేడమ్ టుస్సాడ్ సింగపూర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. అందులో నుండి ఇద్దరు విజేతలు మహేష్ తో సెల్ఫీ దిగొచ్చు. మార్చి 21వ తేదీన ఈ కాంటెస్ట్ ముగియనుంది.
Latest News