by సూర్య | Fri, Mar 15, 2019, 12:28 PM
రాజమౌళి దర్శకత్వంలో భారీ మల్టీ స్టారర్ గా 'ఆర్ ఆర్ ఆర్' రూపొందుతోంది. దాదాపు 350 .. 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమవుతోంది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్గా రూపొందుతున్న 'ఆర్ఆర్ఆర్' ప్రాజెక్టులోకి అలియా భట్ను తీసుకుంటున్నట్లు గురువారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో అఫీషియల్గా ప్రకటించారు. దాంతో ఈ సినిమా కోసం ఆమె ఎంత పారితోషికాన్ని అందుకోనుందనేది ఆసక్తికరంగా మారింది.
'రాజీ' సినిమా హిట్ తరువాత అలియా భట్ తన పారితోషికాన్ని 10 కోట్లకి చేర్చిందట. తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లోను 'ఆర్ ఆర్ ఆర్' సినిమా భారీస్థాయిలో విడుదల కానుంది గనుక, పారితోషికంగా ఆమె 15 కోట్లను డిమాండ్ చేసినట్టుగా సమాచారం. ఆ తరువాత జరిగిన బేరసారాల కారణంగా ఆమెకి 12నుంచి 15 కోట్ల లోపు పారితోషికం అందనుందని చెప్పుకుంటున్నారు. 2020 జూలై 30వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Latest News