బుల్లితెర న‌టుడు రాజేష్ కేసు... కోర్టుకి

by సూర్య | Thu, Mar 14, 2019, 10:31 PM

రాజేష్‌ మరో మహిళతో అనైతిక సంబంధం కొనసాగిస్తున్నాడని ఆత‌ని భార్య‌ శృతి ఆ ఫిర్యాదుపై న‌మోదైన కేసులో పోలీసులు గురువారం విచార‌ణ‌కు యశవంతపుర స్టేష‌న్‌కు హాజ‌ర‌య్యారు.  శృతి అనే యువతితో 2017లో రాజేశ్‌కు వివాహం కాగా కట్నం కోసం తనను వేధిస్తున్నట్లు శృతి కుమారస్వామి పోలీసులకు ఫిర్యాదు చేసిన విష‌యం విదిత‌మే. 498(ఏ) ప్ర‌కారం కేసున‌మోదు చేసిన పోలీసులు రాజేష్‌కు 41 నోటిసులు జారీ చేసి, విచార‌ణ‌కు రావాల‌ని ఆదేశాలిచ్చారు. అయితే కొంత కాలంగా ఆయ‌న అందుబాటులోకి రాక‌పోవ‌టంతో కోర్టుని ఆశ్ర‌యించేందుకు పోలీసులు స‌మాయుత్త‌మ‌య్యారు.  


ఈ క్ర‌మంలోనే గురువారం పోలీసుల ముందు హాజ‌రైన ఆయ‌న మీడియాలో మాట్లాడుతూ కట్నం విషయంలో తాను ఎన్న‌డూ శృతిని వేధించలేదని ఇప్ప‌టికే ఆమె త‌న నుంచి  విడాకులు కావాలని  శృతి కోర్టులో కేసు  వేసిన విష‌యాన్ని ప‌రిగ‌ణ‌లోనికి తీసుకోవాల‌ని కోరిన‌ట్టు చెప్పాడు  విడాకుల కేసులో కట్నం కోసం తాను వేధించినట్లు  ఆమె పేర్కొనలేద‌నే విష‌యాన్ని పోలీసుల దృష్టికి తీసుకువ‌చ్చాన‌ని, చ‌ట్ట‌ప‌రంగానే త‌న భార్య పెట్టిన కేసును ఎదుర్కొంటాన‌ని రాజేష్‌ పేర్కొన్నారు. ఈ కేసులో త‌న కుటుంబ స‌భ్యుల‌ను కూడా లాగుతోంద‌ని ఉద్దేశ‌పూర్వ‌కంగా స‌త్ బ్రాహ్మ‌ణ కుటుంబాన్ని ఆమె వీధుల పాలుచేయాల‌ని చూస్తోంద‌ని చెప్పారు.


మ‌రోవైపు ఇప్ప‌టికే రాజేష్‌పై కేసు న‌మోదంద‌ని, ముందుగా కౌన్సిలింగ్ కోసం త‌మ స్టేష‌న్ నుంచి పిలుపు ఇచ్చినా ఆయ‌న హాజ‌రు కాలేద‌ని, దీంతో 41 నోటీసులు జారీ చేసామ‌ని యశవంతపుర స్టేష‌న్ పోలీసులు చెప్పారు. రాజేష్ అందించిన వివ‌రాల‌ను కేసుతో స‌హా న్యాయ‌స్ధానానికి అందిస్తామ‌ని తెలిపారు.


 

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM