మెగా మేన‌ల్లుడికి క్రేజ్ త‌గ్గ‌లేదు

by సూర్య | Thu, Mar 14, 2019, 10:29 PM

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా సరైన కథల్ని ఎంచులేకోకపోవడం, లుక్స్ పరంగా అప్డేట్ కాకపోవడం, బరువు పెరిగిపోవడం వంటి కారణాల వలన ఆడియన్స్ సాయి ధరమ్ తేజ్‌ను పదే పదే రిజెక్ట్ చేశారు ప్రేక్షకులు. ఒక హీరోకి వరుసగా ఫ్లాపులు వచ్చాయంటే చాలు... అతని ఇమేజ్ దెబ్బతినడం ఖాయం. ఆ తర్వాత అతను చేసే ఏసినిమా చేద్దామన్నా వర్కవుట్ కాదు. పనిలో పనిగా తక్కువ రేటుకే సినిమా కొనాలని బయ్యర్స్ ప్రయత్నిస్తారు.  అయితే... సాయి ధరమ్ తేజ్ విషయంలో అందుకు భిన్నంగా జరిగింది.
సాయి ధరమ్ తేజ్ తాజా చిత్రం ‘చిత్రలహరి’సినిమా మాత్రం భారీ బిజినెస్ చేసి ట్రేడ్ విశ్లేషకులకు సైతం షాకిచ్చింది. ట్రేడ్ వర్గాల రిపోర్ట్ ప్రకారం... ఆ సినిమా రూ.15 కోట్ల ప్రీ రిలీజ్ చేసినట్లు సమాచారం! వరుస పెట్టి పలకరించిన ఫ్లాపుల కారణంగా క్రేజ్ బాగా తగ్గింది అనుకున్నారు. కానీ ‘చిత్రలహరి’  మాత్రం అందరికీ షాకిచ్చింది. సాయి ధరమ్ తేజ మూవీ ప్రీ రిలీజ్ అంత బిజినెస్ చేయడం ఆశ్చర్య చకితులను చేస్తోంది. దీన్నిబట్టి మెగా మేనల్లుడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని అర్థమవుతోంది. నైజాం హక్కుల్ని దిల్‌రాజు తీసుకోగా... వైజాగ్ రైట్స్‌ని గాయత్రి దేవి ఫిల్మ్స్, కృష్ణా రైట్స్‌ని క్రేజీ మూవీ మేకర్స్‌వారు తీసుకున్నారు. మొత్తం మీద మెగా ఫ్యామిలీలో ఈ ‘సుప్రీం’ హీరో తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడని అంతా అంటున్నారు. 


 

Latest News
 
మంగళవారం డైరెక్టర్‌ అజయ్ భూపతికి అరుదైన ఘనత Tue, Apr 16, 2024, 10:19 PM
50M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Tue, Apr 16, 2024, 08:22 PM
'ప్రతినిధి 2' నుండి గల్లా యెత్తి సాంగ్ అవుట్ Tue, Apr 16, 2024, 08:20 PM
మలయాళ సినిమా రీమేక్‌ లో తరుణ్ భాస్కర్ Tue, Apr 16, 2024, 08:18 PM
విశ్వంభర - అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్న మెగాస్టార్ అంకితభావం Tue, Apr 16, 2024, 08:17 PM