మెగాస్టార్ ఫోన్ చేస్తారని అస్సలు అనుకోలేదు

by సూర్య | Tue, Mar 12, 2019, 05:48 PM

తాజాగా పరుచూరి గోపాలకృష్ణ 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో మాట్లాడుతూ, చిరంజీవి హీరోగా చేసిన 'కొదమసింహం' సినిమాను గురించి ప్రస్తావించారు. 'కొదమ సింహం' సినిమా కోసం కథా కథనాలపై కసరత్తు జరుగుతోన్న సమయంలో, చిరంజీవి గారు నేరుగా నాకు ఫోన్ చేశారు. ఆయన నేరుగా ఫోన్ చేస్తారని నేనసలు ఊహించలేదు.

'కొదమ సింహం' కథను వేరేవాళ్లు రాశారు .. సంభాషణలపై సత్యానంద్ గారు కూర్చున్నారు. కథ వింటుంటే ఎక్కడో లోపం వుందని నాకు అనిపిస్తోంది .. ఒకసారి మీరు వినండి .. ఏ లోపం లేదని మీరు చెబితే ముందుకు వెళతాం .. లేదంటే స్క్రీన్ ప్లేపై మీరు కూర్చోండి' అని చిరంజీవిగారు అన్నారు.

చిరంజీవిగారు చెప్పినట్టుగానే నేను వెళ్లి కథ విన్నాను. ఈ సినిమాలో 'సుడిగాలి' అనే పాత్రను మోహన్ బాబు పోషించారు. ఇంటర్వెల్ సమయానికి ఆ పాత్ర చనిపోతుందని సత్యానంద్ నాకు చెప్పారు. 'ఆ పాత్ర చనిపోతే ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ అనేది పోతుంది .. అందువలన ఆ పాత్ర చనిపోకూడదు' అని చెప్పాను. 'సుడిగాలి' బ్రతికుంటే ఎలా ఉంటుందనేది అక్కడి నుంచి స్క్రీన్ ప్లే వేశాము. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది" అని చెప్పుకొచ్చారు.

Latest News
 
మంగళవారం డైరెక్టర్‌ అజయ్ భూపతికి అరుదైన ఘనత Tue, Apr 16, 2024, 10:19 PM
50M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Tue, Apr 16, 2024, 08:22 PM
'ప్రతినిధి 2' నుండి గల్లా యెత్తి సాంగ్ అవుట్ Tue, Apr 16, 2024, 08:20 PM
మలయాళ సినిమా రీమేక్‌ లో తరుణ్ భాస్కర్ Tue, Apr 16, 2024, 08:18 PM
విశ్వంభర - అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్న మెగాస్టార్ అంకితభావం Tue, Apr 16, 2024, 08:17 PM