జూ.ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్

by సూర్య | Sun, May 28, 2023, 01:38 PM

స్వర్గీయ నందమూరి తారకరామారావు శతజయంతి నేడు. నటుడిగా, నాయకుడిగా అభిమానుల గుండెల్లో ఇలవేల్పుగా మారిన ఎన్టీఆర్ శతజయంతి నాడు తెలుగువారంతా ఆయన్ని స్మరించుకుంటున్నారు. శతజయంతి సందర్భంగా అభిమానులు, తారలు, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. నందమూరి వారసుడిగా తాతకి తగ్గ మనవడిగా యంగ్ టైగర్ ఎన్టీర్ పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తిరుగులేని క్రేజ్ తో తారక్ వరుసగా పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నాడు. కాగా నేడు ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా జూ.ఎన్టీఆర్ ట్విట్టర్ లో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. 


మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానరాక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనస్సుతో ఈ ధరిత్రిని ఈ గుండెని ఒక్కసారి తాకిపో తాతా అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పోస్ట్ చేశారు. కాగా ఈ ఉదయం ఎన్టీఆర్.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద తన తాత సమాధికి నివాళులు అర్పించిన సంగతి తెలిసిందే.  జూ.ఎన్టీఆర్ రావడంతో ఎన్టీఆర్ ఘాట్ వద్ద అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీనితో అక్కడ కాస్త తోపులాట జరిగింది. అభిమానుల తోపులాట లోనే తారక్ నివాళులు అర్పించి వెళ్లారు. ఫ్యాన్స్ సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. నందమూరి కుటుంబ సభ్యులంతా తరలివెళ్లి ఎన్టీఆర్ కి నివాళులు అర్పించారు.  అయితే తారక్.. ఎన్టీఆర్ శతజయంతి వేడుకకలు హాజరు కాకపోవడంతో పెద్ద చర్చే జరుగుతోంది. 

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM