by సూర్య | Thu, Mar 23, 2023, 07:44 PM
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించిన హై బడ్జెట్ ఎపిక్ యాక్షన్ డ్రామా 'పొన్నియన్ పార్ట్ 1' సెప్టెంబర్ 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అన్ని భాషల్లో 500 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఆ తర్వాత, ఈ సినిమా సీక్వెల్ను ఏప్రిల్ 28, 2023న విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.
తాజా అప్డేట్ ప్రకారం, మార్చి 29, 2023న జరుగనున్న ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్లో 3 నిమిషాల ట్రైలర్ను విడుదల చేయటానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే, ట్రైలర్ లాంచ్కు సంబంధించి అఫీషియల్ అప్డేట్ రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
ఈ భారీ బడ్జెట్ పీరియడ్ మూవీలో కార్తీ, విక్రమ్, జయం రవి, ఐశ్వర్యరాయ్ బచ్చన్, త్రిష ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ పాన్-ఇండియన్ మూవీకి ఆస్కార్-విజేత సంగీత దర్శకుడు AR రెహమాన్ సంగీతం అందిస్తుండగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ని అందిస్తున్నారు. ఈ సినిమాని మద్రాస్ టాకీస్తో కలిసి లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.
Latest News