by సూర్య | Fri, Feb 03, 2023, 10:18 AM
కళాతపస్వి కే విశ్వనాథ్ గారు ఇక లేరు. నిన్న రాత్రి సమయంలో హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్స్ లో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. కళాతపస్వి నిర్యాణంపై పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.
నటసింహం నందమూరి బాలకృష్ణ గారు విశ్వనాథ్ గారి మరణంపై విషాదాన్ని వ్యక్తం చేస్తూ, ప్రెస్ నోట్ విడుదల చేసారు. విశ్వనాథ్ గారు కన్నుమూయడం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటని, భారతీయ సంస్కృతి సంప్రదాయాలు మరీ ముఖ్యంగా తెలుగుతనాన్ని ఆణువణువూ ప్రతిబింబించేలా ఆయన తీసిన చిత్రాలు తెలుగు సినిమాకే గర్వకారణం అని, తెలుగు సినిమాని ఖండాంతరాలుగా వ్యాపింపజేసి తెలుగు చలనచిత్ర పరిశ్రమకే వన్నె తెచ్చి, ప్రతి తెలుగువాడు గర్వించేలా చేసిన దిగ్గజ దర్శకుడి మరణం తీవ్ర విచారానికి గురి చేసిందని బాలకృష్ణ పేర్కొన్నారు. కళాతపస్వి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని బాలకృష్ణ తెలియచేసారు.
Latest News