by సూర్య | Mon, Jan 30, 2023, 05:52 PM
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహ బాలకృష్ణ నటించిన 'వీర సింహారెడ్డి' సినిమా జనవరి 12, 2023న సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైనా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ ఫోన్ చేయడంతో ఈ సినిమా దర్శకుడు గోపీచంద్ క్లౌడ్ నైన్ లో ఉన్నారు.
జైలర్ నటుడు వీరసింహారెడ్డిని చూసి ఇష్టపడ్డారని దర్శకుడు ట్వీట్ చేశాడు. నా సినిమా గురించి ఆయన ప్రశంసలు మరియు ఆయన భావోద్వేగం నాకు ఈ ప్రపంచంలో అన్నింటికంటే ఎక్కువ థాంక్యూ రజనీ సార్ అంటూ ట్వీట్ చేసారు. ఈ యాక్షన్ డ్రామా సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ జోడిగా నటిస్తోంది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందించారు.
Latest News