![]() |
![]() |
by సూర్య | Mon, Jan 30, 2023, 05:45 PM
గతేడాది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ ఏడాది ఆదిపురుష్ మరియు సాలార్ రెండు సినిమాలతో ఈ నటుడు అభిమానులకు డబుల్ బొనాంజా ఇస్తున్నాడు. ఇప్పటికే ఈ స్టార్ హీరో లైనప్లో పలు ప్రాజెక్టులు ఉన్నాయి. తాజాగా ఇప్పుడు ప్రభాస్ మరియు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలలో ఒక భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి అధికారిక ధృవీకరణ లేనప్పటికీ ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ప్రాజెక్ట్కి సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించనున్నాడగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ ని నిర్మించనున్నారు.
Latest News