by సూర్య | Tue, Jan 24, 2023, 06:22 PM
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న సరికొత్త చిత్రం "కెప్టెన్ మిల్లర్". అరుణ్ మాతేశ్వరన్ డైరెక్షన్లో పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ లో కన్నడ సీనియర్ హీరో కారునాడ చక్రవర్తి డా. శివరాజ్ కుమార్ గారు ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కీరోల్ లో నటిస్తున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్, నివేదితాసతీష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి అభిమానులు తయారు చేసిన కొన్ని పోస్టర్లను ధనుష్ తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసారు. దీంతో ఈ పోస్టర్స్ కాస్తా వైరల్ గా మారాయి.