by సూర్య | Thu, Dec 01, 2022, 08:58 PM
రోహిత్ శెట్టి దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ఒక ప్రాజెక్ట్ ని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'సర్కస్' అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ సరసన సిజ్లింగ్ బ్యూటీ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ డిసెంబర్ 2న గ్రాండ్గా లాంచ్ కానుంది.
ఈ సినిమా డిసెంబర్ 23న భారీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరియు వరుణ్ శర్మ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నాడగా, రణవీర్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని రోహిత్ శెట్టి పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ మరియు టి-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.