by సూర్య | Thu, Dec 01, 2022, 08:40 PM
టాలీవుడ్ సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి గారు, నందమూరి బాలకృష్ణ గారు వచ్చే సంక్రాంతి బరిలో నువ్వా - నేనా అని పోటీకి దిగబోతున్న విషయం తెలిసిందే.
బాబీ డైరెక్షన్లో మెగాస్టార్ నటిస్తున్న ఔటండౌట్ మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ "వాల్తేరు వీరయ్య" జనవరి 2023లో విడుదల కాబోతుందని , అలానే నటసింహం నందమూరి బాలకృష్ణ గారు గోపీచంద్ మలినేని డైరెక్షన్లో నటిస్తున్న పక్కా మాస్ కమర్షియల్ యాక్షన్ చిత్రం "వీరసింహారెడ్డి" కూడా జనవరి 2023లోనే విడుదల అవుతుందని మేకర్స్ తెలిపారు. ఈ విషయం అందరికి తెలిసిందే. ఈ రెండు సినిమాల నిర్మాతలు ఒక్కరే. మైత్రి మూవీ మేకర్స్ సంస్థే ఈ రెండు బిగ్గీస్ ను నిర్మిస్తుంది.
తాజా సమాచారం ప్రకారం, ఒక్కరోజు తేడాతో సీనియర్ హీరోలు బాక్సాఫీస్ దండయాత్రకు బయలుదేరబోతున్నట్టు తెలుస్తుంది. ఈమేరకు వీరసింహారెడ్డి జనవరి 12న, వాల్తేరు వీరయ్య జనవరి 13న థియేటర్లకు రాబోతుందని ప్రచారం జరుగుతుంది. ఐతే, వీటిపై మేకర్స్ అఫీషియల్ అప్డేట్ ఇవ్వవలసి ఉంది.
Latest News