by సూర్య | Tue, Nov 29, 2022, 12:14 PM
మెగాపవర్ స్టార్ రాంచరణ్ నుండి నిన్ననే బిగ్ న్యూస్ వచ్చింది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన తో రాంచరణ్ పాన్ ఇండియా మూవీ చెయ్యబోతున్నట్టు అఫీషియల్ ప్రకటన జరిగింది. ప్రస్తుతం చెర్రీ న్యూజిలాండ్ లో RC 15 షూటింగ్ లో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉన్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీకాంత్, SJ సూర్య, అంజలి కీరోల్స్ లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు.
తాజాగా సోషల్ మీడియాలో చెర్రీ సెన్సేషనల్ మైలురాయిని అందుకున్నారు. రాంచరణ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య తాజాగా 10 మిలియన్స్ కు చేరుకుంది.
Latest News