ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్న మెగాస్టార్

by సూర్య | Mon, Nov 28, 2022, 08:03 PM

గోవాలో జరుగుతున్న 53వ ఐఫీ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డును ప్రకటించారు. ఈరోజు ఐఎఫ్‌ఎఫ్‌ఐ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ చివరి రోజు, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చేతుల మీదుగా చిరంజీవి ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ  కొన్ని దశాబ్దాలుగా ఈ క్షణం కోసమే ఎదురుచూస్తున్నానని అన్నారు . ఈ అవార్డుకు కారణమైన ప్రతి ఒక్కరికీ నిండు హృదయంతో శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు ప్రాంతీయ భేదాలు పోయి భారతీయ సినిమా అనే రోజు వచ్చిందని తెలిపారు. అభిమానుల ప్రేమే తనను మెగాస్టార్‌ని చేసిందని, ఈరోజు ఉన్న స్థితికి తీసుకెళ్లిందని, వారికి జీవితాంతం కృతజ్ఞతతో ఉంటానని అన్నారు. రాజకీయాల నుంచి కెమెరా ముందుకు వచ్చిన తర్వాత తనకు సినీ పరిశ్రమ విలువ తెలిసిందని చిరంజీవి వెల్లడించారు.


 


 

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM