by సూర్య | Mon, Nov 28, 2022, 06:29 PM
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ సోషల్ మీడియాకు దూరంగా ఉండే విషయం తెలిసిందే. కానీ అభిమానులు ఆయనతో తీసుకునే లేటెస్ట్ పిక్స్ మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంటాయి.
ఈమధ్యనే అజిత్ భార్య, హీరోయిన్ షాలిని సోషల్ మీడియా డిబట్ చేసింది. ఇన్స్టాగ్రామ్ లో షాలినీఅజీత్ కుమార్ 2022 అనే అకౌంట్ ను ఓపెన్ చేసింది. క్షణాల్లోనే ఈ అకౌంట్ ను వందలమంది ఫాలో చెయ్యడం విశేషం.
అజిత్, షాలిని సోషల్ మీడియాలో లేకపోవడంతో వీరిద్దరూ కలిసి దిగిన పిక్స్ మీడియాలో ఎక్కువగా కనిపించవు. రీసెంట్గా ఫ్రాన్స్ లో ఈ బ్యూటిఫుల్ కపుల్ దిగిన క్యాజువల్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. తమ అభిమాన నటీనటులను క్లోజ్ గా ఉండడం చూసిన అభిమానులు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
Latest News