by సూర్య | Mon, Nov 28, 2022, 06:03 PM
వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ "గుర్తుందా శీతాకాలం". పలుమార్లు వాయిదా పడి ఎట్టకేలకు ఈ డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నాగశేఖర్ డైరెక్టర్ గా వ్యవహరించిన ఈ సినిమాలో మేఘా ఆకాష్, కావ్యాశెట్టి, సుహాసిని మణిరత్నం కీలకపాత్రల్లో నటించారు.
తాజాగా ఈ సినిమా నుండి మేకర్స్ సెకండ్ సింగిల్ 'సుహాసిని' సాంగ్ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు. వాస్తవానికి ఈ రోజు మధ్యాహ్నం విడుదల కావాల్సిన సుహాసిని సాంగ్ కొన్ని టెక్నికల్ ఇబ్బందుల కారణంగా విడుదల కాలేదు. రేపు సాయంత్రం ఐదింటికి పూర్తి సాంగ్ ను విడుదల చేస్తామని కొంతసేపరి క్రితమే మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
Latest News