by సూర్య | Mon, Nov 28, 2022, 11:05 AM
తలపతి విజయ్, రష్మిక మండన్నా జంటగా నటిస్తున్న చిత్రం "వారిసు". వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ఔటండౌట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు గారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సినిమా నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ 'రంజితమే' విడుదలైందన్న విషయం తెలిసిందే. మూడు వారాలక్రితం విడుదలైన ఈ పాట ఇప్పటికీ యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ వీడియోస్ లో దూసుకుపోతుందంటే, జనాల్లో ఈ పాట ఎంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో తెలుస్తుంది. తాజాగా రంజితమే సాంగ్ యూట్యూబులో 71 మిలియన్ మార్క్ ను చేరుకుంది. 1.9 మిలియన్ లైక్స్ ను రాబట్టింది. హీరో విజయ్ ఈ పాటను పాడడం విశేషం. జానీ మాస్టర్ కొరియోయోగ్రఫీ చేసారు.
Latest News