![]() |
![]() |
by సూర్య | Sat, Nov 26, 2022, 09:40 PM
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ మారుతీ డైరెక్షన్లో గుట్టుచప్పుడు కాకుండా ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోవడంతో ఈ సినిమాపై క్రేజీ రూమర్స్ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి.
ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారని ఎప్పటినుండో ప్రచారం జరుగుతుంది. ఆ ముగ్గురిలో ఇప్పటికే కోలీవుడ్ బ్యూటీ మాళవికా మోహనన్, హైదరాబాద్ బ్యూటీ నిధి అగర్వాల్ కంఫర్మ్ అయ్యారని తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం, మూడవ హీరోయిన్ గా ఒక యంగ్ బ్యూటీ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఆమెవరో కాదు రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ 'స్పోర్ట్స్ వద్దు' అని ఎవరికైతే చెప్తాడో ఆమెనే. రిద్ధి కుమార్. గతంలో రాజ్ తరుణ్ తో "లవర్" లో హీరోయిన్ గా నటించింది. ఆపై తెలుగులో ఏ సినిమాలోనూ రిద్ధి హీరోయిన్ గా నటించలేదు. ఇప్పుడు ఒకేసారి పాన్ ఇండియా స్టార్ సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది.
Latest News