by సూర్య | Thu, Nov 24, 2022, 07:39 PM
కింగ్ నాగార్జున నుండి "ఘోస్ట్" విడుదలై బాక్సాఫీస్ వద్ద పేలవ ప్రదర్శన కనబరిచింది. భారీ అంచనాల నడుమ, సూపర్ పాజిటివ్ టాక్ తో విడుదలైన ఈ సినిమా మంచి మౌత్ టాక్ నైతే సొంతం చేసుకుంది కానీ, మంచి కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో నాగార్జున అప్ కమింగ్ ప్రాజెక్ట్ పై అంతటా ఆసక్తి నెలకొంది.
తాజా సమాచారం ప్రకారం, నాగార్జున మలయాళ సూపర్ హిట్ మూవీ 'పోరింజు మరియం జోస్' రీమేక్ లో నటించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు కొత్తదర్శకుడు ప్రసన్న కుమార్ బెజవాడ దర్శకుడిగా వ్యవహరించనున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మించనున్నారు.
సినిమా చూపిస్తా మావ, నేను లోకల్, హలో గురూ ప్రేమకోసమే, ధమాకా, దాస్ కా ధమ్కీ చిత్రాలకు ప్రసన్న కుమార్ రైటర్ గా పనిచేసారు.
Latest News