"నేను లోకల్" రైటర్ తో నాగార్జున కొత్త సినిమా..??

by సూర్య | Thu, Nov 24, 2022, 07:39 PM

కింగ్ నాగార్జున నుండి "ఘోస్ట్" విడుదలై బాక్సాఫీస్ వద్ద పేలవ ప్రదర్శన కనబరిచింది. భారీ అంచనాల నడుమ, సూపర్ పాజిటివ్ టాక్ తో విడుదలైన ఈ సినిమా మంచి మౌత్ టాక్ నైతే సొంతం చేసుకుంది కానీ, మంచి కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో నాగార్జున అప్ కమింగ్ ప్రాజెక్ట్ పై అంతటా ఆసక్తి నెలకొంది.


తాజా సమాచారం ప్రకారం, నాగార్జున మలయాళ సూపర్ హిట్ మూవీ 'పోరింజు మరియం జోస్' రీమేక్ లో నటించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు కొత్తదర్శకుడు ప్రసన్న కుమార్ బెజవాడ దర్శకుడిగా వ్యవహరించనున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మించనున్నారు.


సినిమా చూపిస్తా మావ, నేను లోకల్, హలో గురూ ప్రేమకోసమే, ధమాకా, దాస్ కా ధమ్కీ చిత్రాలకు ప్రసన్న కుమార్ రైటర్ గా పనిచేసారు.

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM