by సూర్య | Thu, Nov 24, 2022, 04:16 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం నటిస్తున్న పాన్ ఇండియా మూవీ "హరిహర వీరమల్లు". క్రిష్ ఈ సినిమాకు దర్శకుడు కాగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ నటులు అర్జున్ రాంపాల్, బాబీ డియోల్, నోరా ఫతేహి కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం, షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ చివరి వారం నుండి రామోజీ ఫిలింసిటీలో వేసిన భారీ సెట్ లో హరిహర వీరమల్లు చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారితో పాటు 900మంది నటీనటులు మరియు సిబ్బంది చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ మేరకు చిత్రబృందం నుండి అధికారిక ప్రకటన విడుదలైంది. హరి హర వీరమల్లు ఒక మైలురాయి చిత్రం అవుతుందని, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులంతా సంబరాలు జరుపుకుంటారని మేము చాలా నమ్మకంగా ఉన్నాం.. వెండితెరపై అద్భుతాన్ని సృష్టించడానికి మేము చేస్తున్న ఈ గొప్ప ప్రయత్నంలో ముందుకు సాగడానికి మీ అందరి ప్రేమ, మద్దతు మాకు ఇలాగే నిరంతరం అందిస్తారని కోరుకుంటున్నాం... అని నోట్ లో పేర్కొనబడింది.
Latest News