తెలుగు చిత్రానికి అరుదైన గౌరవం
by సూర్య |
Thu, Nov 24, 2022, 03:13 PM
స్వాతంత్ర్య సమరయోధుడు ఖుదీరాం బోస్ జీవితం ఆధారంగా తెరకెక్కిన 'ఖుదీరాం బోస్' చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. గోవాలో జరుగుతున్న 53వ ఇఫీ చలనచిత్రోత్సవంలో 'ఖుదీరాం బోస్' చిత్రాన్ని ప్రదర్శించారు. ఇఫీ ఫిలిం పెస్టివల్ లో ప్రధాన విభాగంగా పరిగణించే ఇండియన్ పనోరమా కేటగిరీలో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు.ఈ చిత్రంలో రాకేష్ జాగర్లమూడి ఖుదీరాం బోస్ పాత్ర పోషించగా, విజయ్ జాగర్లమూడి, డీవీఎస్ రాజు దర్శకత్వం వహించారు. ఈ ఐకానిక్ బయోపిక్ కు రజిత విజయ్ నిర్మాత. ఈ చిత్రం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లోనూ రూపుదిద్దుకుంది.
Latest News