by సూర్య | Thu, Nov 24, 2022, 11:50 AM
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనను కరణ్ జోహార్ పరిచయం చేయడం వల్లే తనపై ఇంతలా ట్రోలింగ్ చేస్తున్నారని అభిప్రాయపడింది. 'ధర్మ ప్రొడక్షన్స్ హౌస్ నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ఇదే నా పై ట్రోలింగ్ కు కారణమనుకుంటా. దీనివల్ల ఒత్తిడికి లోనవుతాను, కానీ క్షణం కూడా పశ్చాత్తాపపడను. ఎందుకంటే కరణ్ జోహార్ బ్యానర్ లో పనిచేసినందుకు నేను అదృష్టవంతురాలిగా ఫీలవుతున్నా. కరణ్ వంటి నిర్మాత నుండి నాకు ప్రేమ, విశ్వాసం, మార్గదర్శకత్వం లభించింది' అని వెల్లడించింది. ప్రస్తుతం జాన్వీ బవాల్, మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమాల్లో నటిస్తుంది.
Latest News