by సూర్య | Thu, Nov 24, 2022, 11:00 AM
విలక్షణ నటుడు కమల్ హాసన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతోపాటు శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది రావటంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలోని పోరూరు రామచంద్ర ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు కమల్. అయితే కమల్ కు పోస్ట్ కోవిడ్ లక్షణాలు అయి ఉంటుందని, అందుకే శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పలువురు భావిస్తున్నారు. బుధవారం జ్వరంతోనే హైదరాబాద్ వచ్చిన కమల్ కే.విశ్వనాథ్ ను కలిశారు. ఈ క్రమంలో కమల్ హాసన్ అస్వస్థతకు గురి కావడం సినీ ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తోంది.
Latest News