by సూర్య | Wed, Nov 23, 2022, 08:56 PM
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహ బాలకృష్ణ సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాకి 'వీర సింహారెడ్డి' అనే టైటిల్ ని లాక్ చేసారు. గతంలో విడుదలైన ఈ సినిమా ఫస్ట్లుక్, టీజర్కి అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది.
తాజా అప్డేట్ ప్రకారం, వీరసింహా రెడ్డి వచ్చే ఏడాది జనవరి 14న థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా చివరి షెడ్యూల్ డిసెంబర్ 19న ప్రారంభం కానుండగా, ఈ షెడ్యూల్తో షూటింగ్ పూర్తి కానుంది.
ఈ యాక్షన్ డ్రామా సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ జోడిగా నటిస్తోంది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందించారు.