by సూర్య | Wed, Nov 23, 2022, 08:22 PM
పలాస 1978 సినిమాతో 2020లో డైరెక్టర్ గా పరిచయమయ్యారు కరుణ కుమార్. ఈ సినిమాకు ఆడియన్స్, విశ్లేషకుల నుండి చాలా మంచి రివ్యూలు వచ్చాయి. ఆపై మెట్రో కధలు, శ్రీదేవి సోడా సెంటర్, కళాపురం చిత్రాలను తెరకెక్కించారు కానీ, కమర్షియల్ సక్సెస్ ఐతే పొందలేకపోయారు.
తాజాగా కరుణ కుమార్ టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ తో ఒక సినిమా చెయ్యబోతున్నట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. కరుణ కుమార్ చెప్పిన స్టోరీ లైన్ విశ్వక్ కు బాగా నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్ ను డెవలప్ చెయ్యమని చెప్పారట. మరి, అన్నీ కుదిరితే, ఈ ఇద్దరి కాంబోలో ఫ్యూచర్ లో సినిమా ప్రకటన రావొచ్చు.
Latest News